డ్రగ్స్ కేసుపై కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. నేరం ఒప్పుకున్నట్లే

డ్రగ్స్ కేసుపై కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. నేరం ఒప్పుకున్నట్లే

డ్రగ్స్  కేసుపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆనర్ మౌనంగా ఉన్నారంటే.. నేరం ఒప్పుకున్నట్లేనన్నారు. డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో సీఎంకు తెలుసన్నారు. వెంటనే వాళ్లతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. సీఎంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రక్త పరీక్షలకు సిద్దమా అని సవాల్ విసరారు బండి సంజయ్. డ్రగ్స్ కేసులో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు సాగర్ లో ప్రచారం చేస్తున్నారన్నారు. ఓ మంత్రి కూడా డ్రగ్స్ కేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. మల్కాజిగిరిలో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు బండి సంజయ్.