కేసీఆర్​ను జైలుకు పంపితేనే.. బీజేపీని జనం నమ్ముతరు

కేసీఆర్​ను జైలుకు పంపితేనే.. బీజేపీని జనం నమ్ముతరు
  •  ప్రధానికి రేవంత్ స్వాగతం పలికితే తప్పేంటి?: మల్​రెడ్డి రంగారెడ్డి
  • లిక్కర్ కేసులో కవితను ఎందుకు అరెస్టు చేయట్లేదని నిలదీత

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ను జైలుకు పంపితేనే బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్ముతారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెAడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్​లో కవితను ఎందుకు అరెస్టు చేయలేదని, ఆమెను కాపాడుతున్నది ఎవరని ప్రశ్నించారు.  మంగళవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని విమర్శించిన ప్రధాని.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 

కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్​ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కారు పాపాలపై రేవంత్ రెడ్డి గతంలో కేంద్రానికి ఎన్నో ఫిర్యాదులు చేశారని, అయినా  ఏ ఒక్క అంశంపైనా స్పందించలేదన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే ప్రొటోకాల్​ ప్రకారం సీఎం రేవంత్ స్వాగతం పలికి మంచి సాంప్రదాయాన్ని పాటించారన్నారు. 

పెండింగ్​ ప్రాజెక్టులు, నిధులు ఇవ్వాలని పీఎంను కోరారన్నారు. గతంలో కేసీఆర్​ ఆ పని చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మర్యాదను మోదీ నిలబెట్టుకోలేదని, స్థాయిని దిగజార్చుకుని విమర్శలు చేశారన్నారు.