సరైన ప్లానింగ్​తో సిద్ధమైతే కొలువు కొట్టడం సులువే

సరైన ప్లానింగ్​తో సిద్ధమైతే కొలువు కొట్టడం సులువే

బ్యాంకింగ్​ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు ఐబీపీఎస్​ నోటిఫికేషన్​ మంచి అవకాశం. సరైన ప్లానింగ్​తో సిద్ధమైతే కొలువు కొట్టడం సులువే.  దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో  6432 పీవో/ మేనేజ్‌‌మెంట్‌‌ ట్రెయినీల ఖాళీలు భర్తీ చేయనున్నారు. తుది నియామకాలు జరిపే సమయానికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తొమ్మిది నుంచి 12 నెలలు సీరియస్​గా ప్రిపేర్​ అయితే బ్యాంక్​ ఉద్యోగం సులువుగా సాధించవచ్చు.

ఐబీపీఎస్​ ద్వారా పీవోతోపాటు మేనేజ్​మెంట్​ ట్రైనీలకు నోటిఫికేషన్​ జారీ అయింది. 11 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఉద్యోగులను  ఎంపిక చేసుకుంటుంది. ఇందులో  బ్యాంక్ ఆఫ్​ బరోడా, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, బ్యాంక్​ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్​, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఇండియన్​ ఓవర్​సీస్​ బ్యాంక్​, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​, యూకో బ్యాంక్​, యూబీఐ ఉన్నాయి. 

సెలెక్షన్​ ప్రాసెస్​: ఎంపిక ప్రక్రియ మూడు పద్ధతుల్లో ఉంటుంది. ప్రిలిమ్స్​, మెయిన్స్​, ఇంటర్వ్యూ మూడంచెల్లో ఉంటుంది.  అక్టోబర్లో ప్రిలిమ్స్, నవంబర్​లో  మెయిన్స్​ ఎగ్జామ్​ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అర్హతలు: వయసు 2‌‌0 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​ సర్వీస్​మెన్​లకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, అంగవైకల్యం ఉన్నవారికి పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్​ఉత్తీర్ణులై ఉండాలి. ఆగస్టు22వ తేదీ నాటికి డిగ్రీ సర్టిఫికేట్​ కలిగి ఉండాలి.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో 10 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్​, కరీంనగర్​, ఖమ్మం, కోదాడ, మహబూబ్​నగర్​, నల్లగొండ, నర్సంపేట, నిజామాబాద్​, సత్తుపల్లి, వరంగల్​ లో సెంటర్స్​ ఉన్నాయి.  

ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ ప్యాటర్న్​: ప్రిలిమినరీ ఎగ్జామ్​ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు సబ్జెక్టులు ఉంటాయి. అవి జనరల్​ ఇంగ్లిష్​, క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​, రీజనింగ్​ ఎబిలిటీ. ప్రిలిమ్స్​లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్​ లాంగ్వేజ్​ నుంచి 30 ప్రశ్నలకు, 30 మార్కులు. కనీసం క్వాలిఫై మార్కులు సాధించాలి. క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​లో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. ఈ సబ్జెక్టులో కనీస అర్హత మార్కులు సాధించాలి.  రీజనింగ్​ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. ఈ సబ్జెక్టులో కనీస అర్హత మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్​లో ప్రతి సబ్జెక్టుకు సపరేట్​ కటాఫ్​ మార్కులు ఉంటాయి. ప్రతి దాంట్లో క్వాలిఫై కాకపోతే  మెయిన్స్​కు అర్హత ఉండదు. 

మెయిన్స్​ ప్లాన్​: మెయిన్స్​ఎగ్జామ్​ 200 మార్కులకు ఉంటుంది. వీటితోపాటు ఇంగ్లిష్ లో లెటర్​ రైటింగ్​, ఎస్సేకు 25 మార్కులు ఉంటాయి. మెయిన్స్​ పరీక్షలో  నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. అవి రీజనింగ్​ అండ్​ కంప్యూటర్​ ఆప్టిట్యూడ్​, జనరల్​, ఎకానమీ, బ్యాంకింగ్​ అవేర్​నెస్​, ఇంగ్లిష్​ లాంగ్వేజ్​, డేటా ఎనాలసిస్​ అండ్​ ఇంటర్​ప్రిటేషన్​. మెయిన్స్​ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుంది. లెటర్​ రైటింగ్​ అండ్​ ఎస్సేకు 30 నిమిషాలు ఉంటుంది. రీజనింగ్​ అండ్​ కంప్యూటర్​ ఆప్టిట్యూడ్ సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. జనరల్ ఎకానిమీ, బ్యాంకింగ్​ అవేర్​నెస్​ సబ్జెక్టు నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లిష్​ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. డేటా ఎనాలసిస్​ అండ్ ఇంటర్​ ప్రిటేషన్​ నుంచి 35 ప్రశ్నలకు 60 మార్కులు, లెటర్ రైటింగ్​, ఎస్సేకు 25 మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్​, మెయిన్స్​లో నెగెటివ్​ మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 0.25 నెగెటివ్​ మార్కులు ఉంటాయి. 

ఇంటర్వ్యూ ప్రాసెస్​: ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఓపెన్​ కేటగిరీ అభ్యర్థుతలు ఇంటర్వ్యూలో కనీస అర్హతగా 40 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఇంటర్వ్యూలో  35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.  మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులపై అభ్యర్థి ఫైనల్​ స్కోర్​ ఆధారపడి ఉంటుంది. మెయిన్స్​కు 80శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.  

ఉద్యోగ ఖాళీలు: పీవో, మేనేజ్​మెంట్​ ట్రైనీ ఖాళీలు 6432 ఉన్నాయి. వీటిలో అన్​రిజర్వ్​డ్​ కేటగిరీ 2596, ఈడబ్ల్యూఎస్​లో 616, ఓబీసీ కేటగిరీలో 1741, ఎస్సీ కేటగిరీలో 996, ఎస్టీ విభాగంలో 483 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బ్యాంకుల వారీగా పరిశీలిస్తే కెనరా బ్యాంక్​లో అత్యధికంగా 2500 ఖాళీలు ఉండగా ఆ తర్వాత యూనియన్​ బ్యాంక్​ ఇండియాలో 2094, యూకో బ్యాంక్​లో 550, బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో 535, పంజాబ్​ నేషనల్​ బ్యాంకులో 500, పంజాబ్ అండ్​ సింధ్​ బ్యాంకులో 253 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

కంప్యూటర్ ఆప్టిట్యూడ్​: ఈ సబ్జెక్టు మీద ప్రశ్నలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రిపీటెడ్​ ప్రశ్నలు కాగా రెండు ఒక సంవత్సరం ముందు వరకు కొత్తగా కంప్యూటర్​ ఆప్టిట్యూడ్​ సబ్జెక్టులో వచ్చిన కొత్త అంశాలపై అడిగే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంలో కంప్యూటర్​ ఆప్టిట్యూడ్​ ప్రశ్నలలో భారీ మార్పులు వచ్చాయి. 90శాతం ప్రశ్నలు కరెంట్​ అఫైర్స్​ రిలేటెడ్​కు సంబంధించినవే అడుగుతున్నారు. 

జనరల్​ ఎకానమీ, బ్యాంకింగ్​ అవేర్​నెస్​: ఈ సబ్జెక్టు కొంచెం విస్తృతంగా కనిపించినా ప్రీవియస్​ పేపర్స్​ పరిశీలిస్తే ముఖ్యమైన అంశాలు ఏమిటో తెలుస్తుంది. డివైడ్​ చేసుకొని ప్రిపరేషన్​ మొదలు పెట్టాలి. ఎకానమీలో  బ్యాంకింగ్​ లింక్​ కలిగిన ఎకానమీ మీదే ఫోకస్​ చేయాలి. ఆర్​బీఐ పాలసీలు, బ్యాంకింగ్​ వ్యవస్థలో  మార్పులపై అవగాహన పెంచుకోవాలి. 

ఐబీపీఎస్​ పీవో ఎగ్జామ్​ ప్యాటర్న్​

ప్రిలిమ్స్​

సబ్జెక్ట్​    ప్రశ్నలు    మార్కులు    సమయం(ని.)
ఇంగ్లిష్​    30    30    20
ఆప్టిట్యూడ్​    35    35    20
రీజనింగ్​    35    35    20
మొత్తం    100    100    60

మెయిన్స్​

సబ్జెక్ట్    ప్రశ్నలు    మార్కులు    టైమ్​
రీజనింగ్​ అండ్​ కంప్యూటర్​ ఆప్టిట్యూడ్​    45    60    60
డేటా ఎనాలసిస్​ అండ్​ ఇంటర్​ప్రిటేషన్​    35    60    45
జనరల్/ఎకానమి/బ్యాంకింగ్​/అవేర్​నెస్​    40    40    35
ఇంగ్లిష్​    35    40    40
మొత్తం    155    200    180


నోటిఫికేషన్​:

మొత్తం ఖాళీలు: 6432

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 22 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. 

పరీక్షలు: ఆన్​లైన్​ ప్రిలిమ్స్​ పరీక్ష అక్టోబర్​లో, మెయిన్స్​ ఎగ్జామ్ నవంబర్​లో నిర్వహిస్తారు. ఇంట‌‌ర్వ్యూలు జనవరి లేదా ఫిబ్రవరిలో జరగనున్నాయి.

వెబ్​సైట్​: www.ibps.in

పృథ్వీ కుమార్​ చౌహాన్​, పృథ్వీస్​ IAS స్టడీ సర్కిల్​