ఓటెయ్యండి.. మేం సెంచరీ కొడ్తం

ఓటెయ్యండి.. మేం సెంచరీ కొడ్తం

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత మాట్లాడిన ఆమె.. హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటు వేయాలన్నారు. తప్పుకుండా ఈ ఎన్నికల్లో తాము సెంచరీ సాధిస్తామన్నారు. అందరు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణం చేయాలన్నారు. నిర్భయంగా ఓటు వేయాలన్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లు పెరిగాయన్నారు. సాయంత్రం వరకు ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. పోలింగ్ సెంటర్ కు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతారన్నారు కవిత.

కూకట్‌‌‌‌పల్లిలో ఉద్రిక్తత: డబ్బులు పంచుతూ దొరికిన టీఆర్ఎస్ నేతలు