అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హాయిగా నిద్రపోవాలనుకుంటే పిచ్చి పిచ్చి పనులను మానుకోవాలంటూ హెచ్చరించారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ లు జపాన్, దక్షిణ కొరియా పర్యటనలను ప్రారంభించారు. సోమవారం జపాన్ చేరుకున్న మంత్రుల టీం.. బుధవారం దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు.
ఇందులో భాగంగా అమెరికాపై ఆ వ్యాఖ్యలు చేశారు కిమ్ యో జాంగ్. కొత్త అధ్యక్షుడు జో బైడెన్ పేరును ప్రస్తావించకుండానే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే నాలుగేళ్లు హాయిగా నిద్రపోవాలనుకుంటే.. పిచ్చి పిచ్చి పనులను చేయడం మానుకోవాలంటూ హెచ్చరించారు.