
హైదరాబాద్, వెలుగు: సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు)లకు ఆర్థికంగా తోడ్పాటును అందించడానికి వారికి సులువుగా గోల్డ్ లోన్లు ఇస్తామని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రకటించింది. భారతీయులకు ఆర్థిక వృద్ధి భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నట్టు ప్రకటించింది. ఎక్కువ డాక్యుమెంట్లు లేకుండా, తక్కువ సమయంలో లోన్లు ఇస్తామని పేర్కొంది. దరఖాస్తు చేసిన రోజే లోన్ఇస్తామని, వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయని తెలిపింది. వ్యక్తిగత ఆర్థిక అవసరాలకు సరిపోయే విధంగా ఈఎంఐ ఆప్షన్లు అందిస్తున్నట్లు సంస్థ వివరించింది. కస్టమర్లు ఆన్లైన్లోనూ గోల్డ్ లోన్లను సులభంగా పొందవచ్చని, వాటిని మేనేజ్చేసుకోవచ్చని ప్రకటించింది.