ఒక్క పైసా కమీషన్‌ తీసుకున్నాని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

ఒక్క పైసా కమీషన్‌ తీసుకున్నాని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తాను ఒక్క పైసా కమీషన్‌ తీసుకున్నానని నిరూపిస్తే తానూ రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజకీయాలు అనేవి డబ్బు సంపాదించే వ్యాపారం కాదని తెలిపారు.  

తాను హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో ప్రసంగిస్తానని, ఈరోజు ప్రజలు యూట్యూబ్‌లో తన ప్రసంగాన్ని వింటారని గడ్కరీ చెప్పారు. తాను యూట్యూబ్ నుండి నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నానని తెలిపారు.  బహిరంగంగా మాట్లాడేందుకు తాను వెనుకాడనని గడ్కరీ అన్నారు. 

తాను కులం గురించి మాట్లాడనని,  తనకు ప్రతి కులం ఓట్లు అవసరమని గడ్కరీ వెల్లడించారు.  కులం గురించి ఎవరు మాట్లాడినా సహించనని చెప్పుకొచ్చారు.  కుల రాజకీయాలను తాను ఎప్పుడూ నమ్మనని గడ్కరీ వెల్లడించారు.