
యాదాద్రి భువనగిరి జిల్లా: కొన్ని రోజులుగా బెల్టు షాపులకు అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని ఆదివారం పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు భువనగిరి టౌన్ పోలీసులు. భువనగిరిలోని హౌసింగ్ బోర్డ్ సమీపంలో ఓ వాహనంలో బెల్టు షాపులకు తరలిస్తున్న రూ.47 వేల మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని, మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు.. పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.