ఇసుక అక్రమ రవాణా ఆపడానికి ‘మన ఇసుక వాహనం’..పైలట్ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాల్లో అమలు

ఇసుక అక్రమ రవాణా ఆపడానికి ‘మన ఇసుక వాహనం’..పైలట్ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాల్లో అమలు
  • ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల  ఆదాయం టార్గెట్​..
  • స్టేట్​మైన్స్​ డెవలప్​మెంట్  కార్పొరేషన్ ఎండీ భవేశ్ మిశ్రా

నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు, ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ‘మన ఇసుక వాహనం’ స్కీమ్ ను తెస్తున్నామని స్టేట్ మైన్స్​డెవలప్​మెంట్​కార్పొరేషన్ ఎండీ భవేశ్​మిశ్రా తెలిపారు. ఖమ్మం, కరీంనగర్, కొత్తగూడెం, నిజామాబాద్​జిల్లాల్లో పైలెట్​ప్రాజెక్టు కింద అమలు చేయనున్నామని చెప్పారు.  

శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్​లో అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ప్రజలు నేరుగా ఆన్​లైన్​బుకింగ్​తో ఇసుక పొందే  అవకాశం ఉంటుందన్నారు. ఫోన్​నంబర్ ద్వారా యాప్​లో ఇసుక బుకింగ్​చేసుకొని డైరెక్ట్​గా పొందవచ్చన్నారు. పంచాయతీ సెక్రటరీని కూడా సంప్రదించి బుకింగ్​చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్​పోర్ట్​, పంచాయతీరాజ్​శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ఆలోచనను సక్సెస్​చేయాలని సూచించారు.  

నాలుగు జిల్లాల్లో అమలు చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. గతేడాది మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి  రూ.738 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు టార్గెట్​పెట్టుకున్నామని పేర్కొన్నారు. ‘ మన ఇసుక వాహనం’ స్కీమ్​ను సక్సెస్​చేయాలని కలెక్టర్​ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తే ఆఫీసర్లను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించమన్నారు. 

తహసీల్దార్లు స్థానికంగా ఉండాలని సూచించారు. అనంతరం మన ఇసుక వాహనం పవర్​పాయింట్​ప్రజంటేషన్ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​రెడ్డి, అడిషనల్ కలెక్టర్​కిరణ్​కుమార్, సబ్​ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్ఞాన్ మాల్వియా, ఆర్డీవో రాజేంద్రకుమార్​, జడ్పీ సీఈవో సాయాగౌడ్, మైనింగ్​ఏడీ సంజయ్​కుమార్, హౌసింగ్​పీడీ పవన్​కుమార్​ అధికారులు పాల్గొన్నారు.