ఉత్త‌రాదిన‌ చ‌లిగాలుల తీవ్ర‌త‌

ఉత్త‌రాదిన‌ చ‌లిగాలుల తీవ్ర‌త‌

ఉత్తర భారతదేశాన్ని చిలిగాలులు వ‌ణికిస్తున్నాయి. అతి త‌క్కువ స్థాయిలో ఉష్ణోగ్ర‌త్త‌లు న‌మోద‌వుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. శ‌నివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అతి త‌క్కువ ఉష్ణోగ్రత అనిIMD తెలిపింది.  మ‌ధ్యాహ్నం సమయంలో 20 డిగ్రీల ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌వుతున్నాయ‌ని.. పొద్దంతా పొగ‌మంచు కురుస్తూనే ఉంద‌ని చెప్పింది.

అయితే ఈ సిజ‌న్‌లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే రెండు డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయంది. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం చిన్న‌ పిల్ల‌లు, ఓల్డ్ ఏజ్ పీపుల్ హెల్త్‌పై చాలా ప్ర‌భావం చూపుతుంద‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. అంతేకాకుండా ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్‌.. రాజ‌స్థాన్‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌ని ప్ర‌క‌టించింది IMD.

గ‌త సీజ‌న్ల కంటే ఈసారి పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే గణనీయంగా త‌గ్గిపోయింది.  చలి గాలులు కూడా ఎక్కువ‌గానే వీస్తున్నాయి.  డిసెంబరు 21 వరకు పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగానే ఉండే ప‌రిస్థితులున్నాయ‌ని  అంచనావేస్తోంది IMD.