ప్రధాని నరేంద్ర మోడీకి ఇమ్రాన్ ఖాన్ ఫోన్

ప్రధాని నరేంద్ర మోడీకి ఇమ్రాన్ ఖాన్ ఫోన్

కలిసి పనిచేద్దామన్న పాక్ ప్రధాని

ఇస్లామాబాద్‌‌: ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇండియా పీఎం నరేంద్ర మోడీని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్న మోడీకి ఇమ్రాన్ ఆదివారం ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. సౌత్‌‌ ఏషియాలో శాం తి నెలకొనేలా ఇండియాతో కలిసి పనిచేయాలని ఇమ్రాన్‌‌ కోరుకుంటున్నా రని, అందులో భాగంగానే మోడీకి ఫోన్ చేశారని పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి మహ్మద్‌‌ ఫైసల్‌‌ తెలిపారు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఎత్తేస్తామని బీజేపీ చెప్పడం,మే 30న ఢిల్లీలో జరిగే మోడీ ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతల్ని పిలవాలని నిర్ణయించిన నేపథ్యంలో పాక్ ప్రధాని ఫోన్ కాల్ చర్చనీయాంశమైంది. అయితే కార్యక్రమానికి పాక్ పీఎంను ఆహ్వానిం చేది లేనిది అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు.