గూగుల్ పే హంతకులను పట్టిచ్చింది

గూగుల్ పే హంతకులను పట్టిచ్చింది

గాంధీ హాస్పిటల్ లో డెడ్ బాడీ వదిలేసి వెళ్లిన కేసును పోలీసుల ఛేదించారు. మృతుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన జితేందర్ గా గుర్తించారు. నగదు లావాదేవిల విషయంలో గచ్చిబౌలిలో జితేందర్ పై ఐదుగురు దాడి చేసినట్టు నిర్ధారణకు వచ్చారు.

అనంతరం ఓ ఆటోలో గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చిన దృష్యాలు సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. సదరు ఆటో డ్రైవర్ కు నిందితుల్లో ఒకరు గూగుల్ పే చేయగా.. దీని ఆధారంగా హంతకులను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.