న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో సందేశాన్ని పంపించారు. ఆ మెసేజ్ ను ఆయన భార్య సునీత గురువారం చదివి వినిపించారు. దీనికి సంబంధించి ఆమె విడుదల చేసిన వీడియోలో కేజ్రీవాల్ ఫొటో ఆసక్తికరంగా మారింది.
ఇంతకుముందు సునీత రిలీజ్చేసిన వీడియోలలో ఆమె వెనక భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు మాత్రమే కనిపించేవి. తాజా వీడియోలో ఆ ఫొటోల మధ్య జైలు ఊచల వెనుక ఉన్న కేజ్రీవాల్ ఫొటో కనిపిస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలంగించాలంటూ హిందూ సేన వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.