తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్​ మరో మెసేజ్

తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్​ మరో మెసేజ్

న్యూఢిల్లీ:  లిక్కర్​ స్కాం కేసులో తీహార్​ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ మరో సందేశాన్ని పంపించారు. ఆ మెసేజ్ ను​ ఆయన భార్య సునీత గురువారం చదివి వినిపించారు. దీనికి సంబంధించి ఆమె విడుదల చేసిన వీడియోలో  కేజ్రీవాల్​ ఫొటో ఆసక్తికరంగా మారింది. 

ఇంతకుముందు సునీత రిలీజ్​చేసిన వీడియోలలో ఆమె వెనక భగత్​ సింగ్​, అంబేద్కర్​ ఫొటోలు మాత్రమే కనిపించేవి. తాజా వీడియోలో ఆ ఫొటోల మధ్య జైలు ఊచల వెనుక ఉన్న కేజ్రీవాల్​ ఫొటో కనిపిస్తోంది. ఈ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. కాగా, కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలంగించాలంటూ హిందూ సేన వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని  తేల్చిచెప్పింది.