
భిండ్: మధ్య ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భిండ్ జిల్లాలోని విర్ఖాదీ గ్రామానికి సమీపంలో ఓ కంటెయినర్, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలవ్వగా.. మరో నలుగురు ప్యాసింజర్ల పరిస్థితి సీరియస్గా ఉంది. వీరిని గ్వాలియర్లోని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నామని భిండ్ ఎస్పీ మనోజ్ సింగ్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.