ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

మియాపూర్: తండ్రి మందలించాడని బాలిక సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన మియాపూర్‌లోని హనీఫ్ కాలనీలో జరిగింది. వివరాలు.. నందిని అనే బాలిక  కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కరోనా కారణంగా ఆఫ్‌లైన్ తరగతులు లేకపోవడంతో ఆన్‌లైన్‌లోనే క్లాసులకు హాజరవుతోంది నందిని. అందుకోసమే ఆమెకు తండ్రి సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అయితే బాలిక తరచూ ఫోన్‌లో ఛాటింగ్ చేస్తుండటంతో కుటుంబీకులు ఆమెను మందలించారు.

వరుసకు మామ అయ్యే వ్యక్తితో తరచూ నందిని చాట్ చేస్తున్నట్లు పేరెంట్స్ గుర్తించారు, దీంతో నందిని తండ్రి ఆమె ఫోన్ తీసుకొని సిమ్ కార్డు మార్చాడు. ఆ తర్వాత బాలిక చిన్నాన్నకు ఈ విషయంలో తెలియడంతో ఆయన వచ్చి నందినితో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లితోపాటు చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.

మరిన్ని వార్తల కోసం: 

ఆమ్దానీ కోసం సర్కార్‌కు లిక్కరే కావాల్నా!

దేశంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ

కంటెయినర్, బస్సు ఢీ.. ఏడుగురు మృతి