- క్యాష్, డైమండ్స్, లిక్కర్, మత్తు పదార్థాలు స్వాధీనం
- ఇప్పటి వరకు రూ.243 కోట్లు పట్టుబడినట్లు సీఈఓ ఆఫీస్వెల్లడి
- గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. పది రోజుల్లోనే 100 కోట్లు ఎక్కువ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ నగదు, మద్యం, బంగారం, వజ్రాలు, ఉచితాలకు సంబంధించిన వస్తువులు మస్త్గా పట్టుబడుతున్నాయి. పోలీసులు, ఎలక్షన్ఆఫీసర్ల టీంలు, ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, తగిన ఆధారాలు చూపకుండా క్యాష్, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్తుంటే స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలోనే ఏకంగా రూ.78.03 కోట్లు విలువ చేసే క్యాష్, డైమండ్స్, లిక్కర్, మత్తు పదార్థాలు సీజ్అయ్యాయి.
దీంతో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా మొత్తంగా రూ.243 కోట్ల సొత్తు పట్టుకున్నట్లు సీఈఓ కార్యాలయం వెల్లడించింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇదే హయ్యెస్ట్. అది కూడా కేవలం 10 రోజుల వ్యవధిలోనే సీజ్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండున్నర నెలల్లో పట్టుబడిన దానికంటే ఎక్కువే పట్టుకున్నారు. అప్పుడు రూ.137 కోట్లు సీజ్ చేసినట్లు సీఈఓ ఆఫీస్ వెల్లడించింది. ఇక ఇంకో పది రోజుల్లో నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. అప్పటి లోగా ఇంకా తనిఖీలు పెంచాలని ఈసీ ఆదేశించింది. చెక్ పోస్టులను కూడా పెంచుతున్నారు.
ఈసారి బంగారం, వజ్రాలు ఎక్కువ పట్టుబడుతున్నయ్
ధారణంగా ఎన్నికల తనిఖీల్లో ఎక్కువగా నగదు, మద్యం, ఉచితాలు ఎక్కువగా సీజ్ అవుతుంటాయి. అయితే, ఈసారి బంగారం, వజ్రాలు, వెండి వస్తువులు ఎక్కువ మొత్తంలో పట్టుబడుతున్నాయి. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటిలో గోల్డ్, డైమండ్స్ వాల్యూనే రూ.120.40 కోట్లు ఉన్నది. ఇందులో బుధవారం ఒక్క రోజే రూ.57.67 కోట్ల విలువైన వాటిని సీజ్ చేశారు. ఇందులో 83.046 కిలోల బంగారం, 212.244 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, ప్లాటినం- 5.35 గ్రాములు ఉన్నది.
ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం మత్తు పదార్థాల విలువ రూ.7.72 కోట్లు, మద్యం విలువ రూ.10.21 కోట్లు, మొత్తం క్యాష్ రూ.87.92 కోట్లు, స్వాధీనం చేసుకున్న మొత్తం ఉచితాల విలువ రూ. 17.48 కోట్లుగా ఉన్నది.