ప్రిన్స్ మూవీకి టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

ప్రిన్స్ మూవీకి టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో సర్కారు వారి పాట సినిమాకు టికెట్ ధరలు పెంచారు. ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రిన్ థియేటర్లలో రూ. 50, సాధారణ ఎయిర్ కండిషన్డ్ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 12వ తేదీ నుంచి 7 రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం.. సర్కారు వారి పాట అదనపు షోలకు ఓకే చెప్పింది.  

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా రూపుదిద్దుకుంది. ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైల‌ర్‌, పాట‌ల‌కు ఫ్యాన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా కోసం ఇటు మ‌హేష్ ఫ్యాన్స్‌.. అటు కామ‌న్ ఆడియెన్స్ అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రేడ్ వ‌ర్గాలు సైతం ఈ సినిమా బిజినెస్ ప‌రంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

మహేశ్ సరసన కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. స‌ముద్ర ఖని విలన్‌గా న‌టించారు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మ‌ది సినిమాటోగ్రాఫ‌ర్‌.

మరిన్ని వార్తల కోసం..

అప్పు తేకుండా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర మాది

ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్ ధర్నా