ప్రజలకు దగ్గర అయ్యేందుకే మన్​కీ బాత్

ప్రజలకు దగ్గర అయ్యేందుకే మన్​కీ బాత్
  • బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట, వెలుగు: ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నాక వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యేందుకే మన్​ కీ బాత్​ కార్యక్రమం నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం  101 మన్​కీ బాత్ ఎపిసోడ్​లో ప్రధాని నరేంద్ర మోడీ యువ సమ్మేళనం ద్వారా వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో వార్డు ప్రజలతో కలిసి సంకినేని మన్​కీ బాత్​ కార్యక్రమాన్ని చూశారు.

కార్యక్రమంలో పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు అయినాపురపు శ్యామల గౌరి, అసెంబ్లీ కన్వీనర్కర్నాటి కిషన్, పట్టణ అధ్యక్షులు అబీద్, పార్లమెంట్​ కన్వీనర్​  మన్మధ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆరూరి శివ, సోషల్​ మీడియా పార్లమెంట్​ కన్వీనర్​ కొప్పుల క్రాంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.