సుప్రీంకోర్టులో  కేఏ పాల్ కు చుక్కెదురు

సుప్రీంకోర్టులో  కేఏ పాల్ కు చుక్కెదురు

ఢిల్లీ : సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు చుక్కెదురైంది. తెలంగాణ నూతన సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై సీబీఐతో విచారణ జరపాలని వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది న్యాయస్థానం. ఈ కేసును కేఏ పాలే స్వయంగా వాదించారు. 

విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కొన్ని  కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలా..? ఈ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలైందా..? అని ప్రశ్నించింది. అయితే.. తన జీవితానికి ముప్పు ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కేఏ పాల్. ఒకదానికి మరొక అంశం ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. కేఏ పాల్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.