మియాపూర్ పరిధి ప్రశాంత్ నగర్ లో సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి నూతన బింబ, ఆలయ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక, ధ్వజస్తంభ ప్రతిష్ఠాప న మహోత్సవ కార్యక్రమాలను సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హానర్ అండ్ ఫ్యామిలీ సంస్థల అధినేతలు వైభవంగా
ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్టు సంస్థ అధినేతలు పొట్టి వెంకటేశ్వర్లు, సీర్ణ రాజమౌళి తెలిపారు.