గండిపేట, వెలుగు : బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో ర్యాపిడో రైడర్ చనిపోయిన ఘటన నార్సింగి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన షంషుద్దీన్ కుటుంబసభ్యులతో కలిసి సిటీకి వచ్చి బండ్లగూడ జాగీర్లోని ఎస్ఎంఆర్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు.
ఆయన చిన్న కొడుకు ఎండీ సలీమ్(28) ర్యాపిడో రైడర్గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం సలీమ్ టీఎస్పీఏ జంక్షన్ వైపు బైక్పై వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి డివైడ్ర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.