హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎన్ని కల మేనిఫెస్టోలో ఆర్టీసీ సమస్యలు చేర్చాలని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డిని ఎంప్లా యీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజి రెడ్డి, యూనియన్ నేత విద్యా సాగర్ రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో కలిసి ఆర్టీసీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైర్ అయిన, చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యుల ప్రాబ్లమ్స్, మెడికల్ అన్ ఫిట్, వీఆర్ఎస్ తీసుకున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ మేనిఫెస్టోలో చేర్చాలని నేతలు కోరారు. కాగా, కార్మికుల సమస్యలను మేనిఫెస్టోలో చేరుస్తామని రేవంత్ హామీ ఇచ్చారని రాజిరెడ్డి తెలిపారు.