కరీంనగర్ లో.. ‘స్మార్ట్‌‌‌‌‌‌‌‌’గా వదిలేశారు

కరీంనగర్ లో.. ‘స్మార్ట్‌‌‌‌‌‌‌‌’గా వదిలేశారు

కరీంనగర్​ సిటీలోని పద్మనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్మార్ట్​సిటీ నిధులు రూ.60లక్షలతో పార్క్​ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు ప్రారంభించి ఏడాదైనా నేటికీ పూర్తికాలేదు. దీంతో పార్క్‌‌‌‌‌‌‌‌లో ఆట వస్తువులు, సేద తీరేందుకు తీసుకొచ్చిన కుర్చీలు మూలనపడ్డాయి. అలంకరణ వస్తువులు కళావిహీనంగా మారాయి.  పార్క్‌‌‌‌‌‌‌‌లో పిచ్చిమొక్కలు మొలిచాయి. మందుబాబులు కొందరు పార్క్‌‌‌‌‌‌‌‌లో తాగుతూ సీసాలు పడేస్తున్నారు.