IANS సీ ఓటర్ సర్వే: అత్యధిక ప్రజాగ్రహ సీఎంగా కేసీఆర్

IANS సీ ఓటర్ సర్వే: అత్యధిక ప్రజాగ్రహ సీఎంగా కేసీఆర్

రాష్ట్రాల్లోని ప్రభుత్వాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై IANS-సీ ఓటర్ సర్వే చేసింది. ఇందులో ముఖ్యమంత్రిపై ప్రజలు చాలా కోపంతో ఉన్న రాష్ట్రంగా తెలంగాణ టాప్ ప్లేస్ లో నిలిచింది. 30.30 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రిపై కోపంతో ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. రెండో స్థానంలో యూపీ, మూడో స్థానంలో గోవా నిలిచాయి. చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఒరిస్సా రాష్ట్రాల సీఎంలపై అక్కడి ప్రజలు తక్కువ కోపంతో ఉన్నారని సర్వేలో తేలింది.

మరోవైపు .. సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనా IANS- సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఎమ్మెల్యేలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్న రాష్ట్రాల్లో 23.5 శాతంతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఇందులో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. గోవా రెండో స్థానంలో ఉంది.  ఇక.. కేరళ, గుజరాత్, మహారాష్ట్రలో ఎమ్మెల్యేలపై ప్రజలు తక్కువ ఆగ్రహంగా ఉన్నట్టు చెప్పారు.

దాదాపు లక్ష మందితో ఈ సర్వే చేసినట్లు సీ ఓటర్‌ వ్యవస్థాపకులు తెలిపారు. 115 అంశాల ఆధారంగా సర్వే నిర్వహించినట్లు చెప్పారు.