మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా విభృంభణ

మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా విభృంభణ

కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. లాక్‌డౌన్‌ ప్రారంభంలో పరిస్థితి అదుపులోనే ఉన్నా సడలింపులతో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ న‌గర్ జిల్లాలో ఇప్పటివరకు 113 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 12 మం ది మృతి చెందారు. అయినా సర్కారు టెస్టులు చేయడం లేదు. పైగా ఉమ్మడి జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాలను మూసివేసింది. దీంతో బాధిత కుటుంబాలు, గ్రామస్తులు, జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసర్లు కూడా ఎక్కడైనా పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు వస్తే.. గంటసేపు హడావుడి చేసి హోంక్వారంటైన్లో ఉండాలని చెప్పి వెళ్లిపోతున్నారు. లోకల్‌ సిబ్బందే శానిటైజ్ చేయిస్తున్నారు.

పాలమూరులో ఎక్కువ కేసులు..
మహబూబ్ నగర్ జిల్లాలో లాక్డౌన్ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదుకాగా.. సడలింపుల తర్వాత 31 మందికి కరోనా సోకింది. సోమవారం నాటికి మొత్తం42 కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ కంటే ముందు కరోనా వచ్చిన వారంతా గాంధీ నుంచి డిశ్చార్జి అయ్యారు. తర్వాత వచ్చిన వాళ్లంతా హైద్రాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకోడానికి వెళ్లి వైరస్‌ అంటించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్ట‌ర్ తో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్కు కరోనా సోకడంతో వారి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్లో ఉంచారు. పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న ఏడుగురికి ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తుండగా.. మరో18 మందిని హోంక్వారంటైన్లో ఉంచారు. వీరికి సంబంధించిన 1021 మంది కుటుంబ సభ్యులు హోంక్వారంటైన్ లో ఉన్నారు.

12 కు చేరిన మరణాల సంఖ్య

ఉమ్మడి జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య12కు చేరింది. నాగర్ క‌ర్నూల్ జిల్లాలో ఐదుగురు, గద్వాల జిల్లాలో ఐదుగురు చనిపోయారు. తాజాగా గద్వాల ఆస్పత్రిలోని ఐసోలేషన్ లో ట్రీట్మెంట్కు వెళ్లి ముగ్గురు చనిపోయారు. నారాయణపేట జిల్లాలో ఓ రెండు నెలల బాలుడు, 23 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మహబూబ్ న‌గర్, నాగర్ క‌ర్నూల్ జిల్లాలో వచ్చిన అధిక కేసులు హైదరాబాద్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచే కాంటాక్ట్ అయిన కేసులేనని మెడికల్‌ ఆఫీసర్లు చెబుతున్నారు. ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లిన‌ వారితో పాటు అనారోగ్య కారణాలతో నిమ్స్, ఉస్మానియాలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్లే అధికంగా ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్