చెలరేగిన రోహిత్..విండీస్ టార్గెట్-168

చెలరేగిన రోహిత్..విండీస్ టార్గెట్-168

ఫ్లోరిడా: విండీస్‌ తో జరుగుతున్న రెండో టీ20 భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. రోహిత్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. రోహిత్ 51 బాల్స్ లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 67 రన్స్ చేశాడు. ధవన్ 23, కోహ్లీ 28 రన్స్ చేశారు. చివరి ఓవర్‌ లో కృనాల్ పాండ్యా (20) రెండు, రవీంద్ర జడేజా (9) ఓ సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. దీంతో భారత్ 167 పరుగులు చేసి విండీస్‌ ముందు బిగ్ టార్గెట్ ను ఉంచింది. విండీస్ బౌలర్లలో ఓష్నె థామస్, షెల్డన్ కాట్రెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కీమో పాల్‌కు ఓ వికెట్ దక్కింది.