
77 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా త్వరత్వరగానే నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామానికి ముందు రెండు, విరామం తరువాత రెండు వికెట్లను కోల్పోయింది. ఇందులో మర్ఫీనే మూడు వికెట్లు తీశాడు. ముందుగా మర్ఫీ బౌలింగ్ లో అశ్విన్(23) ఎల్బీగా వెనుదిరగగా ఆ తరువాత వచ్చిన పుజారా (7) మర్ఫీ బౌలింగ్లోనే బోలాండ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లంచ్ బ్రేక్ తరువాత టీమిండియా వెంటనే నాలుగు, ఐదు వికెట్లను కోల్పోయింది.కోహ్లీ(12)క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, కాసేపటికే లయన్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్(8) ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (95), .జడేజా (2) పరుగులతో ఉన్నారు. ఇంకా టీమిండియా ఇన్నింగ్స్ లో 6 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.