ENG vs IND 2025: 59 మ్యాచ్‌ల్లో ఒకటే ఓటమి.. లీడ్స్ టెస్టులో టీమిండియాను ఊరిస్తున్న విజయం

ENG vs IND 2025: 59 మ్యాచ్‌ల్లో ఒకటే ఓటమి.. లీడ్స్ టెస్టులో టీమిండియాను ఊరిస్తున్న విజయం

లీడ్స్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఆట ఐదో రోజుకు చేరడంతో విజయం ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. 371 పరుగుల ఛేజింగ్ లో నాలుగో రోజు ముగిసేసరికి ఇంగ్లాండ్ వికెట్లేమీ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. చివరి రోజు ఇంగ్లాండ్ గెలవాలంటే 350 పరుగులు చేయాల్సి ఉంది. మరోవైపు టీమిండియా విజయానికి 10 వికెట్లు అవసరం.టెస్ట్ మ్యాచ్ లో 350 పరుగులకు పైగా టార్గెట్ అంటే చాలా కష్టం. అయితే ఇంగ్లాండ్ విషయంలో నమ్మలేని పరిస్థితి. 

తగ్గేదే లేదంటున్న ఇంగ్లాండ్: 

సొంతగడ్డ కావడం.. దూకుడైన బ్యాటర్లు ఆ జట్టులో ఉండడం కలిసి రానుంది. అంతేకాదు 2022 లో బర్మింగ్ హోమ్ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ 378 పరుగుల టార్గెట్ ను అలవోకగా ఛేజ్ చేసింది. అదే కాన్ఫిడెన్స్ తో నేడు ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే 21 పరుగులు కొట్టడంతో ఇంగ్లాండ్ చివరి రోజు మరో 350 పరుగులు చేయాలి. గతంలో ఆస్ట్రేలియాపై 2019లో లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 359 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి సంచలనం సృష్టించింది. 

టీమిండియాకు తిరుగులేని రికార్డ్:

టెస్ట్ క్రికెట్ లో టీమిండియాకు 350 పైగా పరుగులను కాపాడుకోవడంలో అద్భుతమైన రికార్డ్ ఉంది. ఇప్పటివరకు 59 మ్యాచ్ ల్లో 350 పైగా పరుగుల టార్గెట్ ను ఇండియా ఏకంగా 58 సార్లు డిఫెండ్ చేసుకోవడం విశేషం. వీటిలో 42 విజయాలు ఉండగా.. 16 మ్యాచ్ లు డ్రా గా ముగిసాయి. కేవలం ఒకే మ్యాచ్ లో ఓడిపోయింది. అది కూడా 2022 లో ఇంగ్లాండ్ పై బర్మింగ్ హోమ్ లో ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న మొదటి టెస్ట్ చివరి రోజు ఓవర్ కాస్ట్ కండీషన్స్ ఉండడంతో తప్పకుండా భారత్ విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ రాణించడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 

ఇంగ్లాండ్ కు 350 పరుగులు.. టీమిండియాకు 10 వికెట్లు: 

ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (247 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 18 ఫోర్లతో 137), రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ (140 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 15 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 118) సెంచరీలతో చెలరేగడంతో.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ముందు 371 రన్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు సోమవారం నాలుగో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఓవర్లలో 21/0 స్కోరు చేసింది. జాక్‌‌‌‌‌‌‌‌ క్రాలీ (12 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), బెన్‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌ (9 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 90/2 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 96 ఓవర్లలో 364 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471, ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయ్యాయి.