ఇవాళ్టి (జూన్ 1) నుంచి ఒమన్‌కు టారిఫ్ మినహాయింపులు.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

ఇవాళ్టి (జూన్ 1) నుంచి ఒమన్‌కు టారిఫ్ మినహాయింపులు.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: భారత్, ఒమన్ దేశాల మధ్య కుదిరిన కాంప్రహెన్సివ్‌‌ ఎకనామిక్ పార్టనర్షిప్‌‌ అగ్రిమెంట్ (సీఈపీఏ) అమలులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం కొత్త నోటిఫికేషన్‌‌ను ప్రకటించింది. జూన్‌‌ 1 నుంచి (సోమవారం)  ఒమన్ దేశ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ఇరు దేశాల మధ్య గత ఏడాది డిసెంబర్‌‌లో ఈ వాణిజ్య ఒప్పందం కుదిరింది.  

అయితే, ఈ టారిఫ్‌ మినహాయింపును  పొందాలనుకునే దిగుమతిదారులు.. సదరు వస్తువులు ఒమన్ దేశానికి చెందినవేనని డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్‌‌కు తగిన ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.  దాదాపు 77.79 శాతం ఒమన్‌ ఉత్పత్తులపై టారిఫ్​ మినహాయింపులను ఇండియా ఇస్తోంది. విలువ పరంగా చూస్తే ఈ దేశం నుంచి జరిగే మొత్తం దిగుమతులలో ఇది 94.81 శాతం వాటాను కవర్ చేస్తుంది.