దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 14,830 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 2036 కేసులు తగ్గాయి. ప్రస్తుతం 1,47,512 యాక్టివ్ కేసులు ఉండగా..పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో 18,159 వైరస్ నుంచి కోలుకోగా..36 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటివరకు 5,26,110 మంది మరణించగా..4 కోట్ల 32 లక్షల 46వేల 829  మంది కోలుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది.  నిన్న 30లక్షల 42 వేల 47616 లక్షల టీకా  తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 202 కోట్ల 50లక్షల 57వేల 717 కు చేరింది.