24 గంటల్లో 24,248 కేసులు..425 మంది మృతి

24 గంటల్లో 24,248 కేసులు..425 మంది మృతి

భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో 24,248 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 425 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,97,413 కు చేరగా మరణాల సంఖ్య 19,693 కు చేరింది. మొత్తం  4,24,433 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,53,287 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 206619 కేసులు నమోదవగా..8822 మంది చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే( జూలై 5)1,80,596 టెస్టులు చేశారు. జూలై 5 వరకు భారత్ లో మొత్తం  99,69,662 మందికి టెస్టులు చేశారు.