ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ ఈ ఏడాది ఆగస్ట్ 10 నుంచి 12 వరకు ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ (ఐఎస్ఎఫ్) ను నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇన్వెస్టర్లను, ఇతర స్టార్టప్లను కలుసుకోవడానికి ఫౌండర్లకు ఈ ఫెస్టివల్ ఓ వేదికవుతుందని ఈ సంస్థ వివరించింది.
బెంగళూరులోని ముద్దనహళ్ళీలో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇన్వెస్టర్లతో సమావేశం కావడం కోసం స్టార్టప్ రిజిస్ట్రేషన్ గురువారం హైదరాబాద్లోని టీ హబ్లో జరిగింది. ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్షాప్కు వెయ్యికి పైగా స్టార్టప్లు రిజిస్టర్ చేసుకున్నాయి.