టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్‌ల‌పై భారత్ శాశ్వత నిషేధం

టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్‌ల‌పై భారత్ శాశ్వత నిషేధం

దేశ స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమాధికారం, రక్ష‌ణ, భ‌ద్ర‌త, ప్ర‌యోజ‌నాల దృష్ట్యా గ‌తేడాది జూన్‌లో టిక్‌టాక్ స‌హా చైనాకు చెందిన 59 యాప్‌ల‌పై భార‌త ప్ర‌భుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ప్రస్తుతం తాజాగా ఆ యాప్‌ల‌పై కేంద్రం శాశ్వతంగా నిషేధం విదించ‌నుంది. దీనికి సంబంధించి  సంబంధిత యాప్‌ల‌ను శాశ్వ‌తంగా నిషేదించ‌నున్న‌ట్లు తెలుపుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భార‌తీయుల డేటా సేక‌రించి ఈ యాప్‌లు దుర్వినియోగం చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో గతేడాది కేంద్రం వీటిపై తాత్కాలికంగా బాన్ చేసింది. త‌ర్వాత  ఆ సంస్థ‌ల నుంచి వివ‌ర‌ణ కోరింది. వాళ్లు ఇచ్చిన వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెంద‌ని ప్ర‌భుత్వం.. వాటిని శాశ్వ‌తంగా నిషేధించాల‌ని నిర్ణ‌యించినట్లు స‌మాచారం. ఇప్ప‌టికే 200కుపైగా చైనీస్ యాప్స్‌పై ప్ర‌భుత్వం బాన్ చేసింది. అందులో పాపుల‌ర్ గేమ్ ప‌బ్‌జీ కూడా ఒక‌టి.