మే 1వ తేదీన భారత్ కు స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్

మే 1వ తేదీన భారత్ కు స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్

ఇండియాలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతున్న సమయంలో ..రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వి’ అతి త్వరలో దేశానికి రానుంది. మొదటి బ్యాచ్‌ టీకా డోసులు మే 1న భారత్‌కు చేరుకోనున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(RDIF) హెడ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ తెలిపారు. అయితే తొలి కన్‌సైన్‌మెంట్‌లో ఎన్ని టీకాలు ఉండనున్నాయి.. వాటిని ఎక్కడ తయారు చేయనున్నారన్న విషయాలపై ఆయన స్పష్టతనివ్వలేదు. మే 1వ తేదీన భారత్‌కు మొదటి డోసులు డెలివరీ అవుతాయని మాత్రం చెప్పారు. వేసవి చివరినాటికి భారత్‌లో నెలకు 50 మిలియన్‌ డోసుల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు తెలిపారు.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(DCGI) కొద్ది రోజుల క్రితమే అనుమతించింది. RDIF సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు రెడ్డీస్‌ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆ తర్వాతరెండు, మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన రెడ్డీస్‌.. ఇటీవల వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ ట్రయల్స్‌ ఫలితాన్ని సైంటిస్టుల కమిటీ.. భారత్‌లో స్పుత్నిక్‌ వి టీకా అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నలిచ్చింది.