ఆస్ట్రేలియా, భారత్ తో 5 వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం మొహాలీ వేదికగా నాలుగో వన్డే జరగనుంది. రాంచీలో జరిగిన మూడో వన్డేలో ఒడిపోయిన భారత్..ఈ మ్యాచ్ కోసం కొన్ని మార్పులు చేసింది. మిస్టర్ కూల్ ధోనీకి రెస్ట్ ఇచ్చారు. ఆయన ప్లేస్ లో యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ ఆడనున్నాడు.
టీమిండియా సహాయక కోచ్ సంజయ్ బంగర్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ… ‘చివరి రెండు వన్డేల్లో పలు మార్పులు చేయనున్నాం. ఈ రెండు మ్యాచుల్లో ధోనీ ఆడడు. ఆయనకు రెస్ట్ ఇస్తున్నాం’ అని తెలిపారు.
మొదటి మూడు వన్డేల్లో ఆడే పంత్ కి అవకాశం రాలేదు. ఈ రెండు మ్యాచ్ లకు పంత్ ఆడుతాడు. కాలికి గాయం కారణంగా మిగతా రెండు వన్డేల్లో పేసర్ షమీకి కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ‘మిగతా వన్డేల్లో ఆడడానికి షమీ ఫిట్గా ఉన్నాడో.. లేదో తెలుసుకోవాల్సి ఉంది. అతడు ఫిట్ గా లేకపోతే భువనేశ్వర్ ను ఆడిస్తాం. మ్యాచ్ కు ముందు టీమిండియా కోచ్, కెప్టెన్.. ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారు’ అని తెలిపారు సంజయ్ బంగర్.