గుజరాత్ లోని వడోదర కోటంబి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతోన్న మొదటి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. కాసేపట్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయనుంది.
రాబోయే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగాలనే ఏకైక లక్ష్యంతో ఆడుతున్న సూపర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ సిరీస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. విజయ్ హజారే ట్రోఫీలో చెరో రెండు మ్యాచ్లు ఆడిన రో–కో ద్వయం మంచి ఫామ్లో ఉన్నారు. ఏడు రోజుల వ్యవధిలో మూడు వన్డేలు ఆడనుండటంతో అందరి దృష్టి ఈ ఇద్దరిపైనే నెలకొంది. అయితే టీ20 వరల్డ్ కప్ జట్టుకు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్పై కూడా ఉత్కంఠ నెలకొంది. గాయాల కారణంగా గతేడాది సౌతాఫ్రికాతో సిరీస్ నుంచి గిల్ ఎక్కువగా రెస్ట్లోనే ఉన్నాడు. ఫలితంగా అతని ఫామ్పై కూడా ఆందోళన కనిపిస్తోంది. గిల్ రాకతో టాప్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్కు చోటు కష్టంగా మారింది. ప్లీహం గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ నాలుగో నెంబర్లో బ్యాటింగ్కు దిగనున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ప్లేస్ ఖాయం కావడంతో రిషబ్ పంత్ బెంచ్కు పరిమితం కానున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం బుమ్రా, హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వడంతో పేస్ బౌలింగ్ బాధ్యతలను సిరాజ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణకు వదిలేశారు. కుల్దీప్ యాదవ్, సుందర్, జడేజా స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. మంచు, ఫ్లాట్ పిచ్ కారణంగా వికెట్లు తీయడం కంటే రన్స్ నిరోధించడం పైనే బౌలర్లు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
శుభ్మన్ గిల్ ( కెప్టెన్ ), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్ ), శ్రేయాస్ అయ్యర్ (వికెట్ కీపర్ ), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్
డెవాన్ కాన్వే (వికెట్ కీపర్ ), విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్ ), జోష్ క్లార్క్సన్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్, మైఖేల్ రే.
