రాహుల్, ధావన్ అదుర్స్..శ్రీలంకకు భారీ టార్గెట్

రాహుల్, ధావన్ అదుర్స్..శ్రీలంకకు భారీ టార్గెట్

పూణెలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ అదరగొట్గింది. శ్రీలంకకు 202 పరుగుల భారీ టార్గెట్ ను ముందుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో  ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ ( 36 బంతుల్లో 54) ధావన్( 36 బంతుల్లో 52) రెచ్చిపోయారు. వీరికి తోడు వీరాట్ కోహ్లీ 26, మనీష్ పాండే 31 పరుగులు (నాటౌట్), చివర్లో వచ్చిన శార్దూల్ ఠాకూర్ 8 బంతుల్లో 22 పరుగుల(నాటౌట్) తో చెలరేగడంతో 201 పరుగులు చేయగల్గింది. శ్రీలంక బౌలర్లలో సందకన్ కు 3 వికెట్లు, లహీర్ కుమార, హసంగర్ కు చెరో వికెట్ పడ్డాయి.తొలి టీ20 వర్షంతో ఆగిపోగా రెండో టీ20లో భారత్ గెలిచింది. ఈ టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది.