సిరీస్ టీమిండియా కైవసం.. విండీస్ పై గ్రాండ్ విక్టరీ

సిరీస్ టీమిండియా కైవసం.. విండీస్ పై గ్రాండ్ విక్టరీ

కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా ముందు వెస్టిండీస్ పెట్టిన భారీ లక్ష్యాన్ని ను కోహ్లి సేన చేజ్ చేసింది. 4 వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ గెలుపుతో 2-1 తేడాతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 315 పరుగులు చేసింది. టీమిండియా మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో  వెస్టిండీస్ బ్యాటింగ్ చేపట్టింది. భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే  316  పరుగులు చేయాల్సి ఉంది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు  పూరన్ 89,  పోలార్డ్  74, హోప్ 42, ఛేజ్ 38, హెట్మెయిర్  37, లూయిస్ 21 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు నవదీప్ షైనీ 2, షమీ, శార్దూల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు.