IND vs PAK: అభిషేక్, గిల్ ధనాధన్ ఇన్నింగ్స్.. టీమిండియా చేతిలో పాకిస్థాన్‌కు మరో పరాభవం

IND vs PAK: అభిషేక్, గిల్ ధనాధన్ ఇన్నింగ్స్.. టీమిండియా చేతిలో పాకిస్థాన్‌కు మరో పరాభవం

ఆసియా కప్ సూపర్-4 లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 21) జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి దాయాధి జట్టుకు మరోసారి ఘోర పరాభవాన్ని మిగిల్చింది. మొదట బౌలింగ్ లో కాస్త తడబడిన భారత్..  ఆ తర్వాత ఛేజింగ్ లో తిరుగులేని బ్యాటింగ్ తో చెలరేగి ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (74: 39 బంతుల్లో: 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా 18.5  ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. 

172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి బంతికే సిక్సర్ కొట్టి అభిషేక్ తనదిన శైలిలో ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆ తర్వాత వరుసగా ఐదు ఓవర్లలో కనీసం రెండు బౌండరీలు బాదుతూ పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. 7 ఓవర్లో అబ్రార్ అహ్మద్ రెండు సిక్సర్లు కొట్టి జట్టు స్కోర్ ను 85 పరుగులకు చేర్చాడు. గిల్, అభిషేక్ ధాటికి ఇండియా గిల్ 8.4 ఓవర్లలోనే 100 పరుల మార్క్ అందుకుంది. 

తొలి వికెట్ కు 105 పరుగులు జోడించిన తర్వాత 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ వెంటనే సూర్య డకౌట్ కావడంతో ఇండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్ లో అభిషేక్ రెచ్చిపోయి ఆడి 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కొన్ని షాట్లతో అలరించిన అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత సంజు శాంసన్ (13), తిలక్ వర్మ (30), హార్దిక్ పాండ్య (7) జాగ్రత్తగా ఆడి ఇండియాను గెలిపించారు.   

పర్వాలేదనిపించిన పాకిస్థాన్: 
 
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. అయితే మూడో ఓవర్లో హార్దిక్ పాండ్య ఫకర్ జమాన్ (15) వికెట్ తీసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఈ దశలో సైమ్ అయూబ్ తో కలిసి సాహిబ్జాదా ఫర్హాన్ మెరుపులు మెరిపించాడు. దీంతో పాకిస్థాన్ పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా పాక్ ఆధిపత్యం చూపించింది. స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అలవోకగా పరుగులు రాబట్టారు. ప్రతి ఓవర్ లో ఒక సిక్సర్ కొడుతూ తొలి 10 ఓవర్లలో 91 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయించింది.  

రెండో వికెట్ కు 72 పరుగులు జోడించిన తర్వాత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని దూబే విడగొట్టాడు. సైమ్ అయూబ్ (21) వికెట్ తీసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇండియా బౌలర్లు పుంజుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లను తీస్తూ పాకిస్థాన్ ను ఒత్తిడిలోకి నెట్టారు. వికెట్ నష్టానికి 93 పరుగులతో పటిష్టంగా కనిపించిన పాకిస్థాన్.. 4 వికెట్ల నష్టానికి 115 పరుగులతో నిలిచింది. చివర్లో ఫహీన్ అష్రాఫ్ 8 బంతుల్లోనే 2 సిక్సర్లు.. ఒక ఫోర్ తో 20 పరుగులు చేసి పాక్ స్కోర్ ను 170 పరుగులకు చేర్చాడు. తొలి 10 ఓవర్లలో 91 పరుగులు చేసిన పాకిస్థాన్.. తర్వాత 10 ఓవర్లలో 80 పరుగులు చేసింది.