71 పరుగుల తేడాతో జింబాబ్వే పై టీమిండియా విజయం

71 పరుగుల తేడాతో  జింబాబ్వే  పై  టీమిండియా విజయం

టీ20 ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 71 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 187  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  జింబాబ్వే 115 రన్స్ కు ఆలౌట్ అయింది.  9 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు సగం వికెట్లను కోల్పోయింది.   బర్ల్‌ (35), సికిందర్‌ రజ్వా (34)  రాణించగా మిగతా ఆటగాళ్లు ఎవరూ వారికి సహకరించలేకపోయారు. టీమిండియా బౌలర్లలలో అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. 

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల  186 నష్టానికి పరుగులు చేసింది.  రాహుల్(51), సూర్య(61) పరుగులతో రాణించారు. ఈ విక్టరీతో టీమిండియా గ్రూప్ -2లో అగ్రస్థానం దక్కించుకొని సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్‌ తలపడనుండగా, గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా పోరాడనుంది.