హైదరాబాద్సిటీ, వెలుగు: పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు, కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న పీఎస్సీ పంపింగ్ మెయిన్లో వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీలను అరికట్టేందుకు ఈ నెల 11న ఉదయం 6 గంటల నుంచి 12న రాత్రి 10 గంటల వరకు రిపేర్లు చేపడుతున్నారు.
దీంతో ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీరు సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.
