న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాల వాడకాన్ని భారతీయ కంపెనీలు ఈ ఏడాది తగ్గించుకున్నాయి. నిరుటితో పోలిస్తే ఈసారి హెచ్ 1బీ వీసా అప్లికేషన్లను ఇండియన్ కంపెనీలు 37% తగ్గించుకున్నాయని బ్లూమ్బర్గ్ ఒక నివేదిక విడుదల చేసింది.
టెక్నాలజీలు మార్పులు, అమెరికా వర్కర్లను ఇండియన్ కంపెనీలు ఎక్కువగా నియమించుకోవడం, అమెరికా బయటి నుంచి కూడా ఉద్యోగులు పనిచేయడం వంటి కారణాలతో ఈసారి హెచ్ 1బీ వీసా దరఖాస్తులకు ఇండియన్ కంపెనీల డిమాండ్ తగ్గిందని వెల్లడించింది.
2025లో హెచ్ 1బీ వీసా కోసం ఇండియన్ కంపెనీలు చేసుకున్న దరఖాస్తుల్లో 4,573 అప్లికేషన్లను మాత్రమే ఆమోదించారు. ఇక అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసిన కంపెనీల్లో టాప్లో ఉన్నాయి.
