జాహ్నవి మృతి కేసు రివ్యూ చేయండి: ఇండియాన్ కాన్సులేట్

జాహ్నవి మృతి కేసు రివ్యూ చేయండి: ఇండియాన్ కాన్సులేట్
  • సియాటెల్ అటార్నీని కోరిన ఇండియన్ కాన్సులేట్

వాషింగ్టన్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇండియన్ స్టూడెంట్ కందుల జాహ్నవి(23) కేసులో సియాటెల్ అటార్నీ తీర్పుపై ఇండియన్ కాన్సులేట్ రివ్యూ కోరింది. యాక్సిడెంట్​ చేసి, జాహ్నవి మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్​ను సరైన సాక్ష్యాలు లేవంటూ క్రిమినల్ చార్జెస్ నుంచి తప్పించడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. రోడ్డు ప్రమాదంపై మరింత లోతుగా ఎంక్వైరీ చేయాలని కోరింది.

జాహ్నవి ఫ్యామిలీకి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తున్నామని.. తీర్పును రివ్యూ చేయాలని కోరామని ఇండియన్ కాన్సులేట్ శుక్రవారం ‘ఎక్స్’​లో ప్రకటించింది. ఈ కేసును ప్రస్తుతం సియాటెల్ సిటీ అటార్నీ ఆఫీసుకు రెఫర్ చేసినట్లు పేర్కొంంది. కాగా, ఏపీకి చెందిన కందుల జాహ్నవి సియాటెల్​లో మాస్టర్స్ చదివేవారు. గతేడాది జనవరి 23న ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వెహికల్ ​ఢీకొట్టింది.

వెహికల్ తగిలిన స్పీడ్​కు ఆమె వంద అడుగుల దూరం ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో వెహికల్ వేగం గంటలకు 120కి.మీ.పైనే ఉంది. ఆ టైమ్​లో వెహికల్​ను కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడిపించారు. బుధవారం ఈ కేసు రిపోర్టును పరిశీలించిన కింగ్ కౌంటీ ప్రాసిక్యూషన్​ అథారిటీ.. కేసులో ప్రధాన నిందుతుడైన కెవిన్ డేవ్​కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని అతనిపై క్రిమినల్ చార్జెస్​ నమోదు చేయాల్సిందిగా సూచించలేమని తెలిపింది.