ఫేస్బుక్ పరిచయం.. ప్రేమ.. పాకిస్తాన్.. ఇస్లాం మతం ఆచరించటం.. పెళ్లి. భారత మహిళ అంజు(34) పాకిస్తాన్ యువకుడు నస్రుల్లా(29)తో నడిపిన ప్రేమ వ్యవహారమిది. పాక్ అధికారుల నుంచి అనుమతి పత్రాలు, వీసా తీసుకొని.. వాఘా సరిహద్దుల నుంచి పాకిస్థాన్లోకి ప్రవేశించిన ఈ మహిళ.. ఏకంగా మతాన్ని మార్చుకొని సదరు పాకిస్తాన్ యువకుడిని పెళ్లాడటం భారత ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
నస్రుల్లాని కలవడానికి పాకిస్తాన్ వెళ్లిన అంజు..అతన్ని నిఖా చేసుకొని సరదాగా గడుపుతోంది. ఇద్దరు జంటగా కలిసి అందమైన లొకేషన్లలో తిరుగుతూ ఫోటో షూట్లు చేస్తున్నారు. కొన్ని నిమిషాల క్రితం ఆమె బురఖా ధరించిన ఫోటోలు దర్శనమివ్వగా.. తాజాగా, వారి ఫోటో షూట్ వీడియో కూడా బయటకొచ్చింది. ఈ వీడియోలో వీరిద్దరూ జంటగా కలిసి ఓ రొమాంటిక్ సాంగ్కు డ్యాన్సులు వేస్తున్నారు.
Video: Indian girl #Anju with her Pakistani friend Nasrullah Khan in his home district Dir pic.twitter.com/jJJaCmxq1U
— Naimat Khan (@NKMalazai) July 25, 2023
నిన్నమొన్నటి దాకా అంజు వీసా గడువు ముగిశాక భారత్ చేరుకోనుందని వార్తలొచ్చినప్పటికీ.. ఈ వీడియోతో అవన్నీ వాస్తవం కాదని స్పష్టమైంది. 24 గంటలు గడవకముందే మొత్తం సీన్ మారిపోయింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన నుజురుల్లాను కలవటానికి పాకిస్తాన్ వెళ్లిన అంజూ ఏకంగా ఇస్లాం మతం ఆచరించి.. అతన్ని పెళ్లి చేసుకుంది. అంజూ పేరును ఫాతిమాకు మార్చుకుంది. ఇదంతా ఇప్పుడు భారత ప్రజలను గురి చేస్తోంది. నాలుగు రోజులుగా అంజూ చెబుతున్నది అంతా అబద్దమేనా? ఆమె ముందుగానే ప్లాన్ చేసుకున్నదా లేక అక్కడి వారు బలవంతం చేశారా? అన్నది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం అంజూ వీసా గడువు ఆగస్ట్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేయాలి. అయితే ఇప్పుడు ఇస్తాం మతం స్వీకరించటంతోపాటు.. నుజురుల్లాను పెళ్లి చేసుకోవటం.. పేరు మార్చుకోవటం చూస్తుంటే.. పాకిస్తాన్ దేశం ఆమెకు పాక్ పౌరసత్వం ఇస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కచ్చితంగా లవ్ జీహాదీ అంటున్నారు ఇండియన్ నెటిజన్లు.