బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో మన మతపెద్దలు

బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో మన మతపెద్దలు

లండన్: వచ్చే నెలలో జరగనున్న బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్–3 పట్టాభిషేకంలో భారత సంతతి మతపెద్దలు పాల్గొననున్నారు. క్రైస్తవ మత సంప్రదాయంలో పట్టాభిషేకం జరగనున్నప్పటికీ, ఈ కార్యక్రమంలో అన్ని మతాలను భాగం చేయనున్నారు. హిందూ మతపెద్దగా నరేంద్ర బాబుబాయ్ పటేల్, సిక్కు మతపెద్దగా ఇంద్రజిత్ సింగ్ పట్టాభిషేకంలో పాలుపంచుకోనున్నారు. వీరితో పాటు ముస్లిం మతపెద్దగా కమల్, యూదు మతపెద్దగా గిలియన్ మెర్రాన్ పాల్గొననున్నారు. రాజు పట్టాభిషేకంలో ఉపయోగించే వస్తువులను వీళ్లు తీసుకెళ్లనున్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చాలా సందర్భాల్లో కింగ్ చార్లెస్–3 చెప్పారు. అందుకే తన పట్టాభిషేకానికి అన్ని మతాల పెద్దలను ఆహ్వానిస్తున్నారు. కాగా, మే 6 న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 
చార్లెస్ పట్టాభిషేకం జరగనుంది.