అయోధ్యకు వెయ్యికి పైగా రైళ్లు!

అయోధ్యకు వెయ్యికి పైగా రైళ్లు!

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియన్ రైల్వేస్ వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్​కతా, నాగ్​పూర్, లక్నో, జమ్మూ తదితర ప్రాంతాల నుంచి 100 రోజులు ఈ రైళ్లు నడపాలనే ఆలోచన చేస్తోంది. అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుండగా ఆ తర్వాతి రోజు నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తారు.