చైనా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రణయ్‌‌‌‌‌‌‌‌

చైనా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రణయ్‌‌‌‌‌‌‌‌

షెన్‌‌‌‌‌‌‌‌జెన్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌.. చైనా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిదో సీడ్‌‌‌‌‌‌‌‌ ప్రణయ్‌‌‌‌‌‌‌‌ 21–12, 21–18తో మాగ్నస్‌‌‌‌‌‌‌‌ జొనాసెన్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. 40 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ 6–1 లీడ్‌‌‌‌‌‌‌‌తో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టాడు. కానీ వెంటనే తేరుకున్న జొనానెస్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌ కోర్టు ర్యాలీలతో 8–6, 14–11తో ముందంజ వేశాడు. 

ఈ దశలో తన ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించిన ప్రణయ్‌‌‌‌‌‌‌‌ లాంగ్‌‌‌‌‌‌‌‌ ర్యాలీస్‌‌‌‌‌‌‌‌తో ప్రత్యర్థిని నిలువరించి గేమ్‌‌‌‌‌‌‌‌ గెలిచాడు. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరూ 15–15, 18–18 స్కోరుతో సమంగా నిలిచారు. చివర్లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌ మూడు సూపర్‌‌‌‌‌‌‌‌ స్మాష్‌‌‌‌‌‌‌‌లతో విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌‌‌‌‌.. కొడాయ్‌‌‌‌‌‌‌‌ నరోకా (జపాన్‌‌‌‌‌‌‌‌)తో తలపడతాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ సాత్విక్‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ షెట్టి 21–15, 21–16 అకిరా కోగా–తైచి సైటో (జపాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు.