లండన్​లో మన​ స్టూడెంట్​ మిస్సింగ్ .. జైశంకర్ ​సాయం కోరిన మజీందర్ ​సింగ్ ​సిర్సా

లండన్​లో మన​ స్టూడెంట్​ మిస్సింగ్ .. జైశంకర్ ​సాయం కోరిన మజీందర్ ​సింగ్ ​సిర్సా

న్యూఢిల్లీ: యూకేలోని లౌబరో యూనివర్సిటీలో చదువుతున్న ఇండియన్ ​స్టూడెంట్ జీఎస్​భాటియా డిసెంబర్​15 నుంచి కనిపించడంలేదు. బీజేపీ నేత మజీందర్ ​సింగ్ ​సిర్సా సదరు స్టూడెంట్​ ఆచూకీ కనుక్కునేందు కు చొరవ చూపాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్​ను కోరారు.

ఈ మేరకు అదృశ్యమైన స్టూడెంట్​ ఫొటోతో ఆయన ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్​పెడుతూ.. జైశంకర్​కు ట్యాగ్​చేశారు. కాగా సిర్సా పోస్ట్ ప్రకారం.. భాటియా చివరిసారిగా డిసెంబర్ 15న కానరీ వార్ఫ్‌‌‌‌‌‌‌‌లో కనిపించినట్లు తెలుస్తోంది.