న్యూఢిల్లీ: యూకేలోని లౌబరో యూనివర్సిటీలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్ జీఎస్భాటియా డిసెంబర్15 నుంచి కనిపించడంలేదు. బీజేపీ నేత మజీందర్ సింగ్ సిర్సా సదరు స్టూడెంట్ ఆచూకీ కనుక్కునేందు కు చొరవ చూపాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్ను కోరారు.
ఈ మేరకు అదృశ్యమైన స్టూడెంట్ ఫొటోతో ఆయన ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్పెడుతూ.. జైశంకర్కు ట్యాగ్చేశారు. కాగా సిర్సా పోస్ట్ ప్రకారం.. భాటియా చివరిసారిగా డిసెంబర్ 15న కానరీ వార్ఫ్లో కనిపించినట్లు తెలుస్తోంది.