కరోనాపై ట్రైనింగ్ పొందిన డాక్టర్లు రెడీగా ఉండాలి

కరోనాపై ట్రైనింగ్ పొందిన డాక్టర్లు రెడీగా ఉండాలి

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్త రీజనల్ ఎమర్జెన్సీస్ డైరెక్టర్
రోడ్రికో ఓఫ్రిన్ చెప్పారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లేనని అన్నారు. భారత
ప్రభుత్వం పూర్తి సన్నద్దంగా ఉందని, భారీ సంఖ్యలో ఐసోలేషన్ వార్డులను సిద్ధంగా ఉంచిందని చెప్పారాయన. అయితే తక్షణం
చేయాల్సిందల్లా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువైతే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవడమేనని అన్నారు రోడ్రిక్. అందుకోసం భారీ సంఖ్యలో డాక్టర్లు, నర్సులకు ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు.
లక్షణాలు లేకున్నా..
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి మాట్లాడిన రోడ్రికో ప్రజల్లో అవగాహన మరింత పెరగాలన్నారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా జాగ్రత్తపడాలని, ఎవరైనా విదేశాల నుంచి వస్తే.. లక్షణాలేవీ లేకున్నా14 రోజుల పాటు ఇతరులను కలవకుండా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోజులో తరచూ చేతులను సబ్బు లేదా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకోవాలని చెప్పారు రోడ్రిక్. సాధారణ జలుబు, దగ్గు ఉన్నా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని, ఏమాత్రం అనుమానం ఉన్నా ఆలస్యం చేయకుండా డాక్టర్ ని కలవాలని సూచించారు. ముఖ్యంగా ముసలివాళ్లు, చిన్నపిల్లలకు వైరస్ సోకే ముప్పు ఎక్కువని, వారి విషయంలో మరింత శ్రద్ధ అవసరమని చెప్పారు. అయితే ఎండలు పెరిగే కొద్దీ వైరస్ ప్రభావం తగ్గుతుందన్న దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి ఎటువంటి శాస్త్రీయ నిర్ధారణ కాలేదని అన్నారు రోడ్రిక్.