అండర్ 20 వరల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మీట్లో భారత్ రెండో మెడల్ తన ఖాతాలో వేసుకుంది. కెన్యాలోని నైరోబీలో జరుగుతున్న ఈ గేమ్స్లో శనివారం భారత అథ్లెట్ అమిత్ ఖాత్రి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. 10km రేస్ వాక్ ఈవెంట్లో మనకు ఈ పతకం దక్కింది. 42 నిమిషాల 17.94 సెకన్ల రేస్ పూర్తి చేసిన అమిత్ రెండో స్థానంలో నిలిచాడు. కేవలం 7.1 సెకన్ల గ్యాప్లో అమిత్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు.
Medal No.2 for #India at #WorldAthleticsU20 in 1000m Race Walking delivered to you by Amit with a time of 42:19.74 in #Nairobi
— Athletics Federation of India (@afiindia) August 21, 2021
Congratulations Champion! pic.twitter.com/8y7cO1JQQS
కెన్యాకు గోల్డ్ మెడల్
అథ్లెటిక్స్ చాంపియన్షిప్ గేమ్స్కు ఆతిథ్యమిస్తున్న దేశం కెన్యానే 10km రేస్ వాక్లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. కెన్యాకు చెందిన అథ్లెట్ హెరిస్టోన్ వన్యోని 42 నిమిషాల 10.84 సెకన్లలో రేస్ను పూర్తి చేసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 42 నిమిషాల 26.11 సెకన్లలో రేస్ను పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచిన స్పెయిన్కు చెందిన అథ్లెట్ పాల్ మెక్గ్రాత్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.
రిలే రన్లో తొలి మెడల్
భారత్కు అథ్లెటిక్స్ చాంపియన్షిప్ గేమ్స్లో తొలి మెడల్ బుధవారం నాడు జరిగిన 4X400 మీటర్ల మిక్స్డ్ రిలే రన్లో వచ్చింది. ఎస్.భరత్, ప్రియా మోహన్, సమ్మీ, కపిల్ కలిసి పాల్గొన్న ఈ రిలే రన్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచారు.